టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షలో మాజీ మంత్రి పరిటాల సునీత చేసిన కామెంట్స్ పై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. తాను రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు. ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ పరిటాల సునీతను తాను ఎప్పుడూ వదినగానే భావించానని, ఆమె తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. వచ్చే ఎన్నికల వరకు ఎందుకు తాను ఇప్పుడే రాజీనామా చేస్తానన్నారు. చంద్రబాబు... తల్లికి, గర్భస్థ శిశువుకు కూడా గొడవలు పెట్టగల వ్యక్తి అని వంశీ ఆరోపణలు చేశారు. పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలకు రియాక్ట్‌ అయిన వల్లభనేని వంశీ గన్నవరంలో రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. పరిటాల సునీత ముందుండి లోకేశ్ తో గెలిపించుకోవాలని సవాల్‌ చేశారు. 



 Also Read: దిల్లీ టూర్ లో ఈ పదంతోనే పలకరిస్తారా?... చేసేది దీక్షలు మాట్లాడేది బూతులు... చంద్రబాబుపై సజ్జల ఆగ్రహం


నిరసన దీక్షలో పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు 


టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్షలో పాల్గొన్న పరిటాల సునీత నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మారాలన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక గంటసేపు కళ్లు మూసుకుంటే చాలు తామేంటో చూపిస్తామన్నారు. తన భర్త పరిటాల రవిని చంపినప్పుడు చంద్రబాబు ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామని, చంద్రబాబు ఆనాడే కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదన్నారు. టీడీపీ తిరిగి అధికారం చేపట్టాక వైఎస్ఆర్సీపీకి చుక్కలు చూపిస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ అరాచకాలపై ఇప్పటి వరకూ ఓపికతో ఉన్నామన్న పరిటాల సునీత ఇకపై సహించబోమన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కన్నెర్ర చేస్తే దాడులకు పాల్పడుతున్న వాళ్లు ఎవరూ మిగిలేవారు కాదన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు చేపట్టిన దీక్ష వద్ద మాట్లాడిన సునీత.. వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్త పరిటాల రవిని చంపినవాళ్లు రోడ్లపై తిరుగుతున్నా చంద్రబాబుపై ఉన్న గౌరవంతో గొడవ పెట్టుకోకుండా సహనంతో ఉన్నామన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలో వచ్చాక చంద్రబాబు ఓ గంట పాటు కళ్లు మూసుకుంటే చాలు తామేంటో చూపిస్తామన్నారు. 


Also Read: చంద్రబాబు ఢిల్లీ టూర్‌ బీజేపీకి దగ్గరవడానికా ? ఏపీలో రాజకీయాలు మారుతున్నాయా ?


టీడీపీ అవకాశం ఇస్తేనే లీడర్లు


తెలుగుదేశం పార్టీ ఎంతో మందికి అవకాశం ఇచ్చిందని పరిటాల సునీత అన్నారు. అలా అవకాశం ఇచ్చారు కాబట్టే మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లుగా ఎదిగారని పరిటాల సునీత వ్యాఖ్యానించారు. ఇప్పుడు టీడీపీపై వ్యాఖ్యలు చేస్తున్న వారి కంటే ఎక్కువగా మాట్లాగలమన్నారు. చంద్రబాబు అలా సహనం పాటించాలని చెబుతున్నారు కాబట్టి ఓర్పుగా ఉన్నామంటున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కేడర్ ను ఇబ్బంది పెట్టేందుకు చూస్తున్నారన్నారు. ఈ వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ స్పందించి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. 


Also Read: చంద్రబాబు ఓ గంట కళ్లు మూసుకుంటే చాలు... మేమేంటో వైసీపీకి చూపిస్తాం... పరిటాల సునీత సంచలన కామెంట్స్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి