రోడ్లు, ఇతర ప్రాంతాల్లో ర్యాలీలు నిషేదిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్‌ను ఆశ్రయించాల్సిందిగా పిటిషనర్‌కు సూచించింది. త్వరగా విచారణ ముగించి తీర్పునివ్వాలని ఏపీ హైకోర్టుకు ఆదేశించింది. జీవో నెంబర్ 1పై జనవరి 24న విచారణ ముగించిన హైకోర్టు తన తీర్పు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో మరోసారి హైకోర్టుకే వెళ్లాలని పిటిషనర్‌లను సుప్రీంకోర్టు ఆదేశించింది. 


 తెలుగుదేశం నేత కొల్లు రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో జీవో నెంబర్‌1పై విచారించిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విచారించింది. తీర్పును వాయిదా వేసింది. తీర్పు జాప్యంపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జనవరి నుంచి తీర్పు పెండింగ్‌లో ఉన్నట్టు పిటిషనర్లు సుప్రీంకోర్టు దృష్టి తీసుకొచ్చారు. అయితే వీలైనంత త్వరగా తుదితీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.