గుడికి వెళ్లినప్పుడు బంగారు ఆభరణాలు ఎందుకు వేసుకోవాలి..



ఆలయంలో ప్రశాంతతకి దేవుడి మహిమతో పాటూ ఆలయాన్ని నిర్మించిన విధానం, అక్కడ జరుగుతున్న పూజలు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ కి కారణం అంటారు పండితులు. , సాంకేతిక నిపుణులు.



భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్, విద్యుత్ అయస్కాంత తరంగాలు కలుస్తాయో అక్కడే మూల విరాట్ ఉంటుంది. వాటిని ఆలయాల్లో ప్రతిష్టించే ముందు రాగి రేకులను ఉంచుతారు. అవి ఈ తరంగాలకు క్యాటలిస్టుగా పని చేస్తాయి.



చాలా మంది దేవాలయాలకు వెళ్లినప్పుడు ప్రదక్షిణలు చేస్తుంటారు. అలా తిరిగినప్పుడు అక్కడే ఉండే తరంగాల శక్తి మన దేహానికి వస్తుందని నమ్మకం. ఇవి శరీరంలో షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.



ప్రతి దేవాలయంలోనూ పూజారులు మంత్రాలను చదువుతూ ఉంటారు. ఇవెందుకంటే అక్షర నియమంతో ఉండే మంత్రాలు ఒక లయగా ఉండి న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయి.



సాధారణంగా ఆలయాలకు వెళ్లేటప్పుడు పెద్దలు ఆభరణాలు వేసుకుని వెళ్లండని చెబుతారు. ఇది ఆడంబరం చూపించేందుకు అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే ఈ బంగారు ఆభరణాలు తరంగాలను బాగా గ్రహిస్తాయి. తద్వారా శరీరంలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయని చెబుతారు.



దేవాలయాలకు తడి బట్టలతో వెళ్లేవారిని చూసి మడి, ఆచారం అంటుంటాం. కానీ తడి బట్టలకు ఆక్సిజన్ పీల్చే శక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతమైన ఆలయ వాతావరణంలో తడిబట్టలతో వెళితే పుణ్యం కన్నా ఆరోగ్యాన్ని మూటగట్టుకోవచ్చంటారు.



ఔషధగుణాలున్న హారతిని కళ్లకు అద్దుకునేటప్పుడు ఆ వెచ్చదనం కంటికి తగిలితే మంచిదంటారు. అలాకాకుండా ఏ మూలో ఉండి హారతి కళ్లకు అద్దుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదంటారు.



దేవుళ్లకు అభిషేకం చేసిన తర్వాత ఇచ్చే తీర్థంలో పచ్చకర్పూరం, తులసి, లవంగాలు, పంచామృతాలు మిక్స్ చేస్తారు. ఆ తీర్థం తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.



అందుకే భక్తితో మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా అప్పుడప్పుడు ఆలయాలకు వెళ్లిరండి అంటారు పెద్దలు, పండితులు.



దేవుడిపై నమ్మకం ఉండేవారికి ప్రతి చిన్న విషయం అద్భుతమే... దేవుడిపై విశ్వాసం లేని వారికి ఎంత పెద్ద విషయమైనా పూచికపుల్లతో సమానమే. ఫైనల్ గా ఎవరి విశ్వాసాలు వారివి.


Thanks for Reading. UP NEXT

టాలీవుడ్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ సినిమాలివే..

View next story