షియోమీ తన కొత్త సూపర్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే షియోమీ 12 ప్రో.

ఇందులో 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధరను రూ.62,999గానూ, 12 జీబీ ర్యామ్ వేరియంట్ ధరను రూ.66,999గానూ నిర్ణయించారు.

మే 2వ తేదీ నుంచి దీని సేల్ జరగనుంది. అమెజాన్, ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్‌పై రకరకాల ఆఫర్ల కింద రూ.10 వేల తగ్గింపు అందిస్తున్నారు.

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఇందులో 6.72 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్‌డీ+ ఈ5 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.

12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది.

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ టాప్ ప్రాసెసర్ 8 జెన్ 1ని ఇందులో అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4600 ఎంఏహెచ్ కాగా... 120W షియోమీ హైపర్ చార్జ్ ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

ఫోన్ వెనకవైపు మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు అందించారు. ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
(All Images Credit: Xiaomi)