ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ మరోసారి దుమ్మురేపింది.

కామన్వెల్త్‌ క్రీడల్లో ఈ తెలంగాణ బాక్సర్‌ పంచ్‌ పవర్‌ను ప్రదర్శించింది.

మహిళల 50 కిలోల ఫ్లైవెయిట్‌లో స్వర్ణ పతకం ముద్దాడింది.

ఫైనల్లో ఐర్లాండ్‌ బాక్సర్‌ మెక్‌నాల్‌ను సునాయాసంగా చిత్తు చేసింది.

న్యాయనిర్ణేతలు ఏక గ్రీవంగా ఆమెను విజేతగా ప్రకటించారు.

ఈ సీజన్లో ఆమెకు ఇది మూడో అంతర్జాతీయ పతకం కావడం గమనార్హం.

కొన్నాళ్ల కిందే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం అందుకొంది.

ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా మొమొరియల్‌ బాక్సింగ్‌ టోర్నీలో పసిడి పతకం కొల్లగొట్టింది.

తాజాగా కామన్వెల్త్‌లో బంగారు పతకం అందుకుంది.

భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మోదీ ట్వీట్‌ చేశారు.