స్వాతి రెడ్డి గుర్తున్నారుగా! స్వాతి కంటే 'కలర్స్ స్వాతి' అంటే ఎక్కువ మంది గుర్తు పట్టవచ్చు. 

ఇప్పుడు ఇలా వీల్ ఛైర్‌లో కనిపిస్తున్నారు స్వాతి రెడ్డి. ఆమె ఎలా మారిపోయారో చూశారా?

వీల్ ఛైర్‌లో స్వాతి ఎందుకు ఉన్నారు? అంటే... 'పంచతంత్రం' సినిమా కోసం!

హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న 'పంచతంత్రం'లో కొన్ని సన్నివేశాల్లో ఆవిడ వీల్ ఛైర్‌లో కనిపిస్తారు.

ఐదు కథల సమాహారంగా రూపొందిన 'పంచతంత్రం'లో స్వాతి పెయిర్ గా ఆదర్శ్ బాలకృష్ణ నటించారు. 

పెళ్లి తర్వాత కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్న స్వాతి... 'పంచతంత్రం'తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. 

'పంచతంత్రం'లో బ్రహ్మానందం కుమార్తెగా స్వాతి కనిపించనున్నారు. 

'పంచతంత్రం' ట్రైలర్ చూస్తే... స్వాతి రైటర్ అని అర్థమవుతోంది. సినిమా చూస్తే క్లారిటీ వస్తుంది. 

డిసెంబర్ 9న థియేటర్లలో 'పంచతంత్రం' సినిమా విడుదల అవుతోంది.

'పంచతంత్రం' కాకుండా 'మంత్ ఆఫ్ మధు' అని మరో సినిమా చేశారు స్వాతి.

స్వాతి (All Images Courtesy : swati194 instagram)