నటించడమే కాకుండా మన హీరోయిన్లలో కొందరు సింగర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!



నిత్యామీనన్ - 'అలా మొదలైంది'లో 'ఏదో అనుకుంటే', 'ఇష్క్'లో 'ఓ ప్రియా ప్రియా' సాంగ్ పాడింది.



మమతా మోహన్ దాస్ - 'రాఖీ' సినిమాలో 'రాఖీ రాఖీ రాఖీ నా కవ్వసాకి' అనే సాంగ్ పాడింది.



శృతిహాసన్ - 'ఆగడు'లో ఐటెం సాంగ్, 'రేసు గుర్రం'లో 'డౌన్ డౌన్' ఇంకా చాలా పాటలే పాడింది శృతి.



ఆండ్రియా - తెలుగులో ఈమె 'దడ' సినిమాలో 'దివాలీ దీపాన్ని' అనే సాంగ్ పాడింది.



రాశిఖన్నా - 'జోరు' టైటిల్ సాంగ్, 'జవాన్'లో 'బంగారు' వంటి పాటలు పాడింది.



మడోనా సెబాస్టియన్ - 'యూటూ బ్రూటస్' సినిమాలో 'రావుకళిల్' అనే సాంగ్ పాడింది.



కీర్తి సురేష్ - 'స్వామి 2' సినిమాలో 'పుదు మెట్రో రైల్' అనే సాంగ్ పాడింది.



కాజల్ అగర్వాల్ - 'చక్రవ్యూహ' సినిమాలో 'యేనైతూ' అనే సాంగ్ పాడింది.



అనుపమ పరమేశ్వరన్ - 'బటర్ ఫ్లై' మూవీలో 'ఆల్ ది లేడీస్' అనే సాంగ్ పాడింది.