శివుడు పార్వతికి చెప్పిన మృత్యు సంకేతాలు!



శివపురాణం ప్రకారం, పార్వతి దేవి ఒకసారి తన భర్త పరమేశ్వరుడిని ఇలా అడుగుతుంది.. “స్వామి..! మరణానికి సంకేతం ఏంటి, మరణం రాబోతోందని ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. శివుడు ఏం చెప్పాడంటే...



ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు, కొద్దిగా ఎరుపు రంగులో మారినప్పుడు ఆ వ్యక్తి మరో ఆరు నెలలో చనిపోవచ్చని అర్ధం



నీరు, నూనె , అద్దంలో ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు ఆ వ్యక్తి 6 నెలల్లో చనిపోతాడు. ఈ సమయం కన్నా ఒక నెల ఎక్కువ జీవిస్తే తమ నీడను తాను చూసుకోలేరు..ఒకవేళ కనిపించినా ఆ నీడకు తలభాగం ఉండదు



ప్రతి వస్తువు నల్లగానే కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలోనే చనిపోబోతున్నాడని సంకేతం
వారం రోజుల పాటు ఎడమ చేయి మెలితిరిగిపోతున్నట్లు అనిపిస్తున్నా కూడా త్వరలో మరణం తథ్యం



నోరు, నాలుక, చెవులు, కళ్ళు, ముక్కు రాయిలా గట్టిగా మారిపోయినట్లు అనిపిస్తే ఆ వ్యక్తి మరో ఆరు నెలల్లో ప్రాణం కోల్పోతాడు



చంద్రుడు, సూర్యుడు , అగ్ని కాంతిని చూడలేనప్పుడు ఇక జీవించేది ఆరు నెలలే
నాలుక అకస్మాత్తుగా ఉబ్బి, దంతాల్లో చీము వస్తే ఆరు నెలలకు మించి బతకరు



గుడ్లగూబ గురించి కలలు కన్నప్పుడు, ఏదైనా గ్రామాన్ని ఖాళీగా కానీ ధ్వంసం చేసినట్టు కానీ కల వస్తే మృత్యువు సమీపిస్తున్నట్టే



పావురం, కాకి, గద్ద తలపై కూర్చున్నా, వాలినా మరణ సంకేతమే
చనిపోయే ముందురోజు పార్వతీ పరమేశ్వర్లు కలలో పరామర్శిస్తారట



మరణానికి ముందురోజు యమభటులు కల్లో కనిపించి పేరు అడుగుతారు
రెండు పిచ్చుకలు నీళ్లలో మునగితేలినా మీ ప్రాణం గాల్లో కలిపోతుందని సంకేతమే



Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

చాణక్య నీతి: ఇలాంటి వాళ్లతో స్నేహం వద్దు

View next story