శని దోషం తగ్గాలంటే దీపావళి రోజు ఈ దీపం పెట్టండి!



ఏలినాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని..ఏదో ఒక దశలో శని కారణంగా ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. దీన్నుంచి ఉపశమనం కలగాలంటే దీపావళి రోజు ఇలా చేయండి..



దీపావళి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి మూడు గుప్పెడల నల్ల నువ్వులు ఓ తెల్లటి గుడ్డలో మూట కట్టాలి. ఒత్తి ఆకారంలో వచ్చేలా మూట కట్టి నువ్వుల నూనెలో నానపెట్టాలి.



దీపావళి రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీపూజ చేసిన తర్వాత తులసికోట దగ్గర దివ్వ కొడతారు. దివ్వ కొట్టి (ఈ పద్దతి కొన్ని ప్రాంతాల వారికి ఉంది కొన్ని ప్రాంతాల వారికి లేదు) ఇంట్లోకి వచ్చాక బయట దీపాలు పెట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు



ఇల్లంతా లక్ష్మీ కళ ఉట్టిపడేలా దీపాలతో అలంకరించి బాణసంచా వెలిగిస్తాం. మొత్తం అంతా పూర్తైంది ఇక ఇంట్లోకి వెళ్లిపోవడమే అనే సమయంలో ఈ నువ్వుల దీపాన్ని వెలిగించాలి.



నువ్వుల దీపాన్ని ప్రత్యేక ప్రమిదలో వెలిగించి ఇంటి ఆరు బయట ఉంచాలి. నగరాల్లో ఉన్నవారైతే ఇంటి గేటు బయట ఓ మూలగా వెలిగించి వెనక్కు తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వెళ్లిపోవాలి.



మూట కట్టిన నువ్వులన్నీ మసైపోయే వరకూ దీపం వెలిగేలా కర్పూరం పొడి లాంటివి కూడా దానిపై వేయొచ్చు. ఇలా చేయడం ద్వారా శనిదోషం తగ్గుతుందని చెబుతారు.



కొందరు ఇంటి ముందు దీపాలు పెట్టడం కన్నా ముందే శనిదీపం వెలిగించి అది పూర్తిగా కొండెక్కిన తర్వాత ఇల్లంతా దీపాలు పెడతారు. అంటే శనని తరిమికొట్టి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతున్నామని అర్థం వచ్చేలా.



శనిదీపం ఎప్పుడు పెట్టినా మంచిదే... దీపాల వరుసతో సమానంగా కాకుండా ఆరంభంలో కానీ చివర్లో కానీ వెలిగించడం ఉత్తమం అంటారు పండితులు.



పూజలు, ఉపవాసాలు, నోములు చేస్తే గ్రహదోషాలు పూర్తిగా తొలగిపోవు కానీ ఉపశమనం మాత్రం లభిస్తుందంటారు పండితులు.



శని దోషం తొలగించుకునేందుకు శనివారం ఆలయాలకు వెళతారు, నవగ్రహాలకు తైలాభిషేకం చేస్తారు, నువ్వులు దానం చేస్తారు..ఇలా ఎన్నో రెమిడీస్ ఫాలో అవుతారు. వాటిలో ఒకటి దీపావళికి పెట్టే నువ్వుల దీపం.



Images Credit: Pixabay


Thanks for Reading. UP NEXT

ఇలాంటి భోజనం చేయకూడదు!

View next story