భారతదేశానికి చెందిన సర్గమ్ కౌశల్ మిసెస్ వరల్డ్ 2022-23 టైటిల్‌ను గెలుచుకున్నారు.

దీని కోసం ఆవిడ 63 మందితో పోటీ పడ్డారు.

21 సంవత్సరాల తర్వాత మిసెస్ వరల్డ్ కిరీటం భారతదేశానికి దక్కింది.

భారత నటి, మోడల్ అదితి గోవారికర్ 2001లో చివరిసారిగా ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు.

అదితి గోవారికర్ కూడా సర్గమ్‌ను అభినందించారు.

32 సంవత్సరాల సర్గమ్ కౌశల్ స్వస్థలం జమ్మూ కశ్మీర్.

కానీ ముంబైల్ ఉంటున్నారు.

తన భర్త ఆదిత్య మనోహర్ శర్మ భారతీయ నేవీ ఆఫీసర్.

2015 నుంచి డేటింగ్‌లో ఉన్న వీరు 2018లో వివాహం చేసుకున్నారు.

పెళ్లయ్యాకనే సర్గమ్ సీరియస్‌గా మోడలింగ్ చేశారు.
(All Images Credits: Sargam Koushal Credits)