నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్లు మన దైనందిన జీవితంలో విడదీయరాని భాగంగా మారాయి. పని నుంచి వినోదం వరకు.. స్క్రీన్పై ఎక్కువ ఆధారపడిపోతున్నాము.
సోషల్ మీడియా, గేమ్స్, రీల్స్, మెసేజింగ్లలో ప్రజలు చాలా సేపు టైమ్ వేస్ట్ చేస్తారు. చాలా మందికి ఈ స్క్రీన్ సమయం అర్ధరాత్రి దాకా కొనసాగుతుంది. ఇది ఎంత హానికరమో తెలుసా?
అనేకమంది రాత్రి సమయంలో మొబైల్ ఫోన్లను ఉపయోగించడం వల్ల.. నిద్ర కోల్పోతారు. దాని కంటే కూడా ఎక్కువ ప్రభావాలు చూపిస్తుంది. ఇది మీ మెదడు, మానసిక స్థితి, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
మొబైల్ స్క్రీన్ల నుంచి వెలువడే నీలిరంగు కాంతి నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ను తగ్గిస్తుంది. ఇది రాత్రి సమయంలో శరీరం సహజంగా విశ్రాంతి తీసుకోవడం కష్టతరం చేస్తుంది.
నడిరాత్రి సమయంలో కూడా నీలి కాంతికి గురైతే మెదడు మేల్కొని ఉండమని సంకేతాలిస్తుంది. ఇది మీ శరీర గడియారాన్ని గందరగోళానికి గురిచేస్తుంది. సహజ నిద్ర విధానాన్ని దెబ్బతీస్తుంది.
రాత్రి ఆలస్యంగా నిరంతరం స్క్రోలింగ్ చేయడం వల్ల మనస్సు అధికంగా ఉత్తేజితమవుతుంది. ఫలితంగా చాలా మంది త్వరగా నిద్రపోవడానికి కష్టపడుతున్నారు. దీనివల్ల గంటల తరబడి అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు.
సరిగ్గా విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల మానసిక సామర్థ్యాలు తగ్గుతాయి. జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది. రోజంతా మెదడు మందగిస్తుంది.
అలెర్ట్స్, సందేశాలు, సోషల్ మీడియా అప్డేట్లు మెదడును నిరంతరం చురుకుగా ఉంచుతాయి. ఇది మానసిక విశ్రాంతిని నిరోధిస్తుంది. నిజమైన విశ్రాంతిని దూరం చేస్తుంది.
రాత్రి బాగా పొద్దుపోయే వరకు మొబైల్ ఫోన్ వాడటం మెదడును అలసిపోయేలా చేస్తుంది. దీనివల్ల పగటిపూట అలసట, తక్కువ ఉత్పాదకత, శక్తి లేకుండా డ్రైన్ చేస్తాయి.