పచ్చిపాలల్లో ఇది మిక్స్ చేసి ముఖానికి అప్లై చేస్తే

Published by: Geddam Vijaya Madhuri

పాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అంతేకాకుండా అందానికి కూడా మేలు చేస్తాయి.

అందుకే పాలల్లో కొన్ని కలిపి ముఖానికి అప్లై చేస్తే బ్యూటీకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు.

పాలల్లో తేనెను కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల మెరిసే స్కిన్ మీ సొంతమవుతుంది.

ఇది చర్మాన్ని క్లియర్​గా చేయడంతో పాటు.. హెల్తీ స్కిన్​ని ప్రమోట్ చేస్తుంది.

యాంటీ ఏజింగ్ ప్రయోజనాల కోసం దీనిని ముఖానికి అప్లై చేయొచ్చు.

ముఖానికి మంచి గ్లోని ఇస్తుంది. మాయిశ్చరైజర్​ని అందించి మంచి షైన్ ఇస్తుంది.

ముఖంపై ఉన్న పింపుల్స్, యాక్నే డాట్స్​ని తగ్గిస్తుంది. రెగ్యూలర్​గా దీనిని అప్లై చేస్తే మంచి ఫలితాలుంటాయి.

ముడతలు పడకుండా దీనిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు స్కిన్​ని టైట్ చేస్తాయి.

పాలను, తేనెను సమపాలల్లో తీసుకుని బాగా కలిపి దీనిని ఉపయోగించాలి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. (Images Source : Envato)