డబుల్ మసాలాతో హెల్త్ కు ట్రబుల్

Published by: Anjibabu Chittimalla

చాలా మంది రాత్రిపూట బిర్యానీ లాంటి మసాలా ఫుడ్స్ తీసుకుంటారు.

డబుల్ మసాలాతో కూడిన బిర్యానీ ఎక్కువగా తినడం మంచిది కాదంటున్నారు నిపుణులు.



రాత్రిపూట మసాలాలు, ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయంటున్నారు.



ముఖ్యంగా నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడే అవకాశం ఉందంటున్నారు.



డబుల్ మసాలా ఫుడ్స్ జీర్ణ వ్యవస్థను కూడా ఇబ్బంది పెడతాయి.



కొన్నిసార్లు కాఫీ, ఫ్యాట్స్, చక్కెర ఎక్కువగా ఉండే ఫుడ్స్ తోనూ నిద్రలేమి కలుగుతుంది.



రాత్రి నిద్రకు కనీసం 2 గంటల ముందు లైట్ ఫుడ్ తీసుకోవడం మంచిది.



గోరువెచ్చని పాలు, అరటిపండ్లు, బాదం, తేనె తీసుకుంటే చక్కగా నిద్ర వస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com