పాలు మన రోజువారీ ఆహారంలో అత్యంత పోషకమైన భాగాలలో ఒకటిగా చెప్తారు. ఇది బలాన్ని ఇస్తుంది. పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
పాలు కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. కానీ పాలను తప్పు ఆహారాలతో కలిపి తీసుకోకూడదు.
చాలా మందికి పాలు అన్ని రకాల ఆహారాలతో తీసుకోకూడదని తెలియదు. కొన్ని కలయికలు జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి.
పాలుతో కలిపి ఎప్పుడూ తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. ఈ కాంబినేషన్ శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని ఎలా చూపుతాయో తెలుసుకుందాం.
నారింజ, నిమ్మ, జామ, ఇతర పుల్లని పండ్లు పాలతో కలిపి తీసుకోకూడదు. ఈ కాంబినేషన్ తీసుకుంటే అవి కడుపులో గడ్డ కట్టేలా చేస్తాయి. దీని వలన అజీర్ణం, ఉబ్బరం, అసౌకర్యం కలుగుతుంది.
ఆయుర్వేదం ప్రకారం పాలు, చేపలను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. చర్మంపై మచ్చలు, అలర్జీలు లేదా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.
పాలు, ఉప్పు కలిగిన ఆహారాల కలయిక జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. శరీర జీవక్రియ ప్రక్రియను బలహీనపరుస్తుంది. ఇది భారంగా, అసౌకర్యంగా ఉంటుంది.
పాలుతో ఊరగాయ తినడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి. ఎందుకంటే పులియబెట్టడం, మసాలా దినుసులు పాలు చల్లదనాన్ని దెబ్బతీస్తాయి.
పాలుతో ఉల్లిపాయలను తీసుకోవడం హానికరం అని చెప్తారు. ఎందుకంటే ఇది శరీరంలో వేడిని, విషాలను పెంచుతుంది. ఇది జీర్ణవ్యవస్థలో అసమతుల్యతకు దారితీస్తుంది.
పాలు, ముల్లంగిని కలిపి తీసుకోవడం వల్ల చర్మ అలర్జీలు, దురద లేదా పుండ్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాటి వ్యతిరేక లక్షణాలు శరీర సమతుల్యతను దెబ్బతీస్తాయి.