'హలో' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కళ్యాణి ప్రియదర్శన్.

ఆ తరువాత 'చిత్రలహరి', 'రణరంగం' వంటి సినిమాల్లో నటించింది.

ఇటీవల ఈ బ్యూటీ నటించిన 'మానాడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో కళ్యాణి ప్రియదర్శన్ ఇండస్ట్రీలో మరింత బిజీ అయింది.

ఎక్కువగా తమిళ, మలయాళ చిత్రాల్లోనే నటిస్తోంది. 

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఫొటోషూట్ లో పాల్గొంది.

వాటిని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

కళ్యాణి ప్రియదర్శన్ లుక్ కి అభిమానులు ఫిదా అయిపోయారు.

ఆమెని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

కళ్యాణి ప్రియదర్శన్ ఫొటోలు