న్యూజిలాండ్‌తో తొలి టీ20కి టీమ్‌ఇండియా రెడీ!

న్యూజిలాండ్‌తో తొలి టీ20కి టీమ్‌ఇండియా రెడీ!

వెల్లింగ్టన్‌ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్‌ ఆరంభం.

టీ20 ప్రపంచకప్‌లో రెండు జట్లు సెమీస్‌లోనే వెనుదిరిగాయి.

ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 9-9తో సమానంగా ఉన్నాయి.

ఈ సిరీస్‌తో టీమ్‌ఇండియా కుర్రాళ్లతో ప్రయోగాలు చేపడుతోంది. కెప్టెన్సీ, కోచింగ్‌ బాధ్యతలు హార్దిక్‌, వీవీఎస్‌ తీసుకున్నారు.

సూర్య, పాండ్య ఫామ్‌లో ఉన్నారు. కిషన్‌, పంత్‌, శ్రేయస్‌, హుడా, శాంసన్‌, గిల్‌ బ్యాటింగ్‌లో కీలకం.

అర్షదీప్‌, భువీ, ఉమ్రాన్‌, హర్షల్‌, సిరాజ్‌ పేస్‌ చూస్తారు. యూజీ, కుల్‌దీప్‌, సుందర్‌ స్పిన్‌ చూస్తారు. హుడా పార్ట్‌టైమ్ స్పిన్నర్‌.

ఓపెనింగ్‌, మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ కాంబినేషన్లు ఎలా సెట్‌ చేస్తారో చూడాలి. సంజూకు ఫినిషర్ రోల్‌ ఇవ్వొచ్చు.

కివీస్‌లో కాన్వే, ఫిలిప్స్‌, అలెన్‌ ఫామ్‌లో ఉన్నారు. విలియమ్సన్‌, మిచెల్‌, నీషమ్‌, బ్రాస్‌వెల్‌ బ్యాటింగ్‌ కీలకం.

సౌథీ, మిల్న్‌, లాకీ, నీషమ్‌ పేస్‌ బౌలింగ్‌ వేస్తారు. శాంట్నర్‌, సోధి రూపంలో మంచి స్పిన్నర్లు ఉన్నారు.