ABP Desam


జనవరి 30 వరకూ శ్యామల నవరాత్రులు, వీటి ప్రత్యేకత ఏంటంటే!


ABP Desam


శ్యామల నవరాత్రులు, గుప్త నవరాత్రులు..ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా..దక్షిణాదిన కన్నా ఉత్తరాదిన ఈ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు.


ABP Desam


ఈ ఏడాది మాఘ గుప్త నవరాత్రులు జనవరి 22 నుంచి ప్రారంభమై 30 వ తేదీ వరకూ ఉంటాయి. శక్తి ఆరాధనకు ఈ తొమ్మిరోజులు రహస్య మార్గంలో సాధన చేస్తారు..అందుకే గుప్త నవరాత్రులు అనే పేరువచ్చింది


ABP Desam


శరన్నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకో రూపంలో పూజించినట్టే...శ్యామల నవరాత్రుల్లో కూడా దుర్గమ్మని తొమ్మిది రూపాలలో అలంకరించి పూజిస్తారు.


ABP Desam


శ్యామలాదేవి తిరుగాడే ఈ నవరాత్రుల్లో అమ్మను ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారు వారి కోర్కెలు నెరవేరతాయని విశ్వాసం.


ABP Desam


మంచి ఉద్యోగం, ఉన్నత పదవులు, విద్య, ఐశ్వర్యం లభిస్తాయి. భార్య-భర్త మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పెళ్లికానివారికి పెళ్లి జరుగుతుందని చెబుతారు.


ABP Desam


హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగిదేవిగా ప్రసిద్ధి చెందింది. శ్యామలాదేవిని మహామంత్రిణీ దేవి అని కూడా అంటారు.


ABP Desam


ఈ గుప్త నవరాత్రులను దేవత కోపాన్ని తగ్గించేందుకు జరుపుకుంటారు. ఈ సమయంలో దేవి తన భక్తులకు ఆరోగ్యం, శ్రేయస్సు, జ్ణానం , సానుకూల శక్తులను ప్రసాదిస్తుంది.


ABP Desam


గుప్త నవరాత్రుల సమయంలో అన్ని రకాల భయాలు మరియు ఆందోళనలు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం.



Images Credit: Pinterest