దీపావళికి శనిదీపం ఇలా వెలిగించండి!



దీపావళి రోజు ఉదయాన్నే తలంటుపోసుకుని, పరిశుభ్రమైన దుస్తులు ధరించి.. దేవుడి దగ్గర కూర్చుని మూడు గుప్పెడల నల్ల నువ్వులు ఓ తెల్లటి వస్త్రంతో మూటలా కట్టాలి.



ఒత్తి ఆకారంలో వచ్చేలా మూట కట్టి నువ్వుల నూనెలో నానపెట్టాలి. అది అలా పక్కన పెట్టేసి ఉంచాలి. దీపావళి రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీపూజ చేసిన తర్వాత తులసికోట దగ్గర దివ్వ కొడతారు.



దివ్వ కొట్టి (ఈ పద్దతి కొన్ని ప్రాంతాల వారికి ఉంది కొన్ని ప్రాంతాల వారికి లేదు) ఇంట్లోకి వచ్చాక బయట దీపాలు పెట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు.



ఇల్లంతా లక్ష్మీ కళ ఉట్టిపడేలా దీపాలతో అలంకరించి బాణసంచా వెలిగిస్తారు. కొందరు దీపాలను తీసుకొచ్చి ఇంటిముందు వెలిగించే ముందు నువ్వుల దీపం వెలిగిస్తే..ఇంకొందరు బాణసంచా కాల్చడం పూర్తైన తర్వాత నువ్వుల దీపాన్ని వెలిగిస్తారు.



నువ్వుల దీపాన్ని ప్రత్యేక ప్రమిదలో వెలిగించి ఇంటి ఆరు బయట ఉంచాలి. నగరాల్లో ఉన్నవారైతే ఇంటి గేటు బయట ఓ మూలగా వెలిగించి వెనక్కు తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వెళ్లిపోవాలి.



మూట కట్టిన నువ్వులన్నీ మసైపోయే వరకూ దీపం వెలిగేలా కర్పూరం పొడి లాంటివి కూడా దానిపై వేయొచ్చు. ఇలా చేయడం ద్వారా శనిదోషం తగ్గుతుందని చెబుతారు.



కొందరు ఇంటి ముందు దీపాలు పెట్టడం కన్నా ముందే శనిదీపం వెలిగించి అది పూర్తిగా కొండెక్కిన తర్వాత ఇల్లంతా దీపాలు పెడతారు. అంటే శనని తరిమికొట్టి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతున్నామని అర్థం వచ్చేలా.



శనిదీపం ఎప్పుడు పెట్టినా మంచిదే... దీపాల వరుసతో సమానంగా కాకుండా ఆరంభంలో కానీ చివర్లో కానీ వెలిగించడం ఉత్తమం



Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

చాణక్య నీతి:మీరు నమ్మే వ్యక్తులు ఇలానే ఉన్నారా!

View next story