యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ మధ్య విభేదాల వార్తలు వైరల్ అయ్యాయి.

సోషల్ మీడియాలో ధనశ్రీ చాహల్ పేరు తొలగించడమే ఇందుకు కారణం.

వీరిద్దరూ విడాకులు తీసుకుంటారని వార్తలొచ్చాయి.

అలాంటిదేమీ లేదని ధనశ్రీ కొట్టి పారేసింది.

విడాకులను సూచించడానికి సోషల్ మీడియాలో ఇంటిపేరును తొలగించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది.

దాంతో విడాకుల వార్తలు షికారు చేశాయి.

22 డిసెంబర్ 2020న యుజ్వేంద్ర, ధనశ్రీ తమ పెండ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో షేర్ చేశారు.

ఐపీఎల్ 2022 సమయంలోనూ వీరిద్దరూ ఎంతో రొమాంటిక్ గా కనిపించారు.

ధనశ్రీ తన ఇన్‌స్టాలో తన భర్త ఇంటిపేరు ‘చాహల్’ని తొలగించాక “కొత్త జీవితం లోడ్ అవుతోంది” అంటూ చాహల్ ఓ ఫొటోను పంచుకున్నాడు.

ఇది మరింత గందరగోళానికి తెరతీసింది.