హనుమాన్ ఘన విజయం తరువాత.. తేజ సజ్జా తన తదుపరి యాక్షన్-అడ్వెంచర్ చిత్రం మిరాయ్తో వస్తున్నాడు.
ఏప్రిల్ 18న విడుదల కావాల్సిన మిరాయ్ తర్వాత ఆగస్టు 1, 2025కి వాయిదా పడింది. ఇప్పుడు సెప్టెంబర్ 12, 2025కి వాయిదా వేశారు.
వినాయక చవితి తర్వాత రోజు ఆగస్టు 28వ తేదీన ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.
తేజ సజ్జా ఒక సూపర్ హీరోగా ఈ సినిమాలో కనిపించనున్నారు. హై-ఆక్టేన్ యాక్షన్, అడ్వెంచర్స్తో ఈ సినిమాను తెరకెక్కించారు.
ఫస్ట్ లుక్ పోస్టర్లో తేజ సజ్జా లుక్ చాలా డిఫరెంట్గా కనిపించారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, టీజర్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి.
ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్గా చేస్తున్నారు. రితికా నాయక్ హీరోయిన్గా చేస్తోంది.
కార్తీక్ గట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిబాబు కరణం మాటలు అందించారు.
మిరాయ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కింద విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
గౌర హరి ఈ సినిమాకు సంగీతం అందించగా.. నాగేంద్ర రంగాల ఆర్ట్ డైరక్షన్ చేశారు.