Image Source: Trisha Instagram

నేడు త్రిష పుట్టినరోజు. ఆమె 1983 మే 4న కృష్ణన్ అయ్యర్, ఉమా దంపతులకు జన్మించింది.

'జోడి' మూవీలో చిన్న పాత్రలో నటించిన త్రిష.. 'మౌనం పేసియాధే'తో హీరోయిన్ గా మారింది.

'నీ మనసు నాకు తెలుసు' చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది త్రిష.

కెరీర్‌ ప్రారంభించి రెండు దశాబ్దాలు దాటినా, ఇప్పటికీ హీరోయిన్ గా ఆఫర్స్ అందుకుంటోంది.

2023లో 3 సినిమాలతో అలరించిన త్రిష కృష్ణన్.. ప్రస్తుతం ఐదు చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'విశ్వంభర' మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.

కమల్ హాసన్ - మణిరత్నం కాంబోలో రూపొందే 'థగ్ లైఫ్' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.

'విదా ముయార్చి' మూవీ కోసం తమిళ హీరో అజిత్ కుమార్ తో జత కడుతోంది త్రిష.

'రామ్' అనే మలయాళ సినిమాలో సీనియర్ హీరో మోహన్ లాల్ తో కలిసి నటిస్తోంది.

'ఐడెంటిటీ' చిత్రంలో మలయాళ హీరో టొవినో థామస్ కు జోడీగా కనిపించనుంది.

Image Source: Trisha Instagram

'బృందా' అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలో అడుగుపెడుతోంది త్రిష కృష్ణన్.

Thanks for Reading. UP NEXT

తేజస్వి ప్రకాష్ కళ్లు చెదిరే లెహెంగా కలెక్షన్స్‌ - సంగీత్‌ నైట్‌కి పర్ఫెక్ట్‌!

View next story