ప్రస్తుతం ఆధార్‌ నంబర్‌, బ్యాంకు అకౌంట్‌ నిత్యావసరాలుగా మారిపోయాయి.



ఆధార్‌ నంబర్‌ తెలిసినంత మాత్రాన బ్యాంకు ఖాతాలను హ్యాక్‌ చేయలేరని నిపుణులు అంటున్నారు.



ఓటీపీ, వేలి ముద్ర, ఫేస్‌ ఐడీ, ఐరిష్‌ వివరాలు సైబర్‌ మోసగాళ్లకు తెలియనంత వరకు ఇబ్బందేమీ లేదు.



ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్స్‌ నుంచి సైబర్‌ నేరగాళ్లు డబ్బులు కొట్టేయడంతో ప్రభుత్వం సెక్యూరిటీ ప్రొటొకాల్స్‌ను పెంచింది.



నకిలీ లేదా గమ్మీ చేతి ముద్రలతో చేసే మోసాల నుంచి రక్షించేందుకు యూఐడీఏఐ AI లేదా మెషీన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీని ప్రవేశపెట్టింది.



ఫింగర్‌ మైన్యూటి రికార్డు - ఫింగర్‌ ఇమేజ్ రికార్డు (FMR - FIR)ను ఉపయోగిస్తోంది



ఈ వ్యవస్థ చేతి వేలి ముద్రలు, అందులోని రేఖలు, రేఖల మధ్య ఖాళీ, జీవజాలాన్ని గుర్తిస్తుంది.



ఫింగర్‌ప్రింట్‌ చిత్రాల్లోని వేలి ముద్రల్లో రేఖలు మందంగా కనిపిస్తాయి. ఆ రేఖల మధ్య లోయలు తేలికగా ఉంటాయి. అలాగే రేఖల మధ్య కొనసాగింపు ఉండదు.



NPCI మరో సెక్యూరిటీ ప్రొటొకాల్‌ను ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ (FRM) టెక్నాలజీ తీసుకొచ్చింది. ఇది రియల్‌ టైమ్‌లో మోసాల నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తుంది.



బ్యాంకు పేరు, ఆధార్‌ సంఖ్య, బయోమెట్రిక్‌ని రహస్యంగా ఉంచాలి. యూఐడీఏఐలో మీ మొబైల్‌తో బయోమెట్రిక్‌ను లాక్‌ చేసుకోవాలి.