తెలుగు కుటుంబానికి చెందిన ఐశ్వర్య రాజేష్ మరెవ్వరో కాదు, తెలుగు నటుడు రాజేష్ కూతురు.

చెన్నైలో పుట్టి పెరగడం వల్ల ఆమెకు తమిళం మీదే ఎక్కువ పట్టు ఉంది. తెలుగులో కూడా మాట్లాడగలదు.

ఐశ్వర్య రాజేష్ కొన్నేళ్లు మోహన్ బాబుకు చెందిన తిరుపతిలో శ్రీ విద్యా నికేతన్‌లో కూడా చదివింది.

ఐశ్వర్య రాజేష్.. తెలుగు హాస్య నటి శ్రీలక్ష్మికి మేనకోడలు.

తెలుగమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్ లోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

తెలుగులో ‘రాంబంటు’ చిత్రంతో బాల నటిగా పరిచయమైంది.

'కౌసల్యా కృష్ణమూర్తి' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత తెలుగులో 'వరల్డ్ ఫేమస్ లవర్', 'టక్ జగదీష్' సినిమాల్లో నటించింది.

ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా గడుపుతోంది.

ఐశ్వర్య రాజేష్ ఓ బట్టి కొట్టులో కాఫీ పెడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

Images And Videos Credit: Aishwarya Rajesh/Instagram