ఆయుర్వేదం ప్రకారం భోజనం తినేటప్పుడు నీళ్లు తాగవచ్చా?

భోజనం తింటూ నీళ్లు తాగాలా వద్దా? ఎప్పుడు తాగాలి? అనే విషయంలో ఆయుర్వేదం ఏం చెబుతోందో తెలుసుకోండి.

భోజనం మధ్యలో నీళ్లు తాగడం, లేదా తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణ క్రియకు అంతరాయం కలుగుతుంది.

ఇలా నీళ్లు తాగడం వల్ల ఆహారాన్ని జీర్ణం చేసే జీర్ణ రసాలు నీళ్లతో కలిసి పలుచగా మారిపోతాయి.

దీంతో తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. ఎక్కువ భాగం వ్యర్ధంగా బయటికి పోతుంది.

ఇలా నీళ్లు తాగడం వల్ల ఆహారాల్లో ఉండే పోషకాలు కూడా శరీరం గ్రహించలేదు.

సరిగా జీర్ణం కాకుండా మిగిలిపోయే ఆహారాలు కొవ్వు రూపంలోకి మారిపోతాయి.

ఇన్సులిన్ నిరోధకత పెరిగిపోతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.

అందుకే భోజనానికి ముందు, మధ్యలో, తిన్న వెంటనే నీళ్లు తాగరాదు.