బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నముఖ్యమంత్రి కేసిఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి కేసిఆర్ నేతలతో ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా కిసాన్ అందోళన్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 


హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి, పీసీసీ గందరగోళంపై క్లారిటీ 


పీసీసీ కార్యవర్గం ఏర్పాటు తదనంతర పరిణామాలపై నేడు నేతల రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. పీసీసీ కార్యవర్గం ప్రకటన సమయంలో రేవంత్ రెడ్డి ఢిల్లో ఉన్నారు. కానీ తెలంగాణలో మాత్రం నేతలు కమిటీ ఏర్పాటుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దామోదర్ రాజనర్సింహా ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఘాటుగా విమర్శించారు. కొండా సురేఖ రాజీనామా చేశారు. సిఎల్పీ నేత భట్టి తో నేతలు వరుస భేటీలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ వార్ రూంపై పోలీసులు సోదాలు నిర్వహించి హార్డ్ డిస్క్‌లు తీసుకెళ్లిపోయారు. ఈ పరిణామాలన్నింటిపై టీపీసీసీ అధ్యక్ష్యుడు రేవంత్ రెడ్డి నేతలు ఈ రోజు చర్చించనున్నారు. 


హైదరాబాద్‌ నిమ్స్‌ ఉద్యోగాల దరఖాస్తులకు నేడే చివరి తేదీ


నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌ పంజాగుట్టలోని వైద్య సంస్థలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌తో పలు విభాగాల్లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 46 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అనస్థీషియాలజీ, బయోకెమిస్టీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఎండోక్రైనాలజీ, జనరల్ మెడిసిన్, హెమటాలజీ, మెడికల్ జెనెటిక్స్, నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నాయి. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్‌, ఎండీ, డీఎం, ఎంఎస్‌, ఎంసీహెచ్‌, డీఎన్‌బీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల వయసు 50 ఏళ్లు మించకూడదు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,01,500 జీతంగా చెల్లిస్తారు. 


నేడుఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగులకుజాబ్ మేళా


నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ములుగు రోడ్డులోని పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటిఐ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి మల్లయ్య ఈ సందర్భంగా తెలిపారు. దాదాపు 121 కంపెనీల ప్రతినిధులు ఉద్యోగ మేళ కోసం రానున్నట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్ డిప్లమో డిగ్రీ ఇంటర్, పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు విద్య అర్హత కాపీల జిరాక్స్‌తో హాజరు కావాలన్నారు.


నేడు కర్నాటక ఫుడ్ ఫెస్టివల్


నేడు హైదరాబాద్‌లో కర్ణాటక ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది. బర్కత్ పుర లింగంపల్లిలోని న్రుపతుంగ విద్యాసంస్థ ప్రాంగణంలో సాయంత్రం నాలుగ గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది. దీనిలో కర్ణాటకకు చెందిన వివిధ వంటకాలు ఉంచుతారు.


ఏసుక్రిస్తు జీవితం ప్రదర్శ
క్రిస్మస్ పురస్కరించుకొని లోక రక్షకుడు క్రీస్తు జీవిత విశేషాలతో "క్రిస్మస్ డ్రైవ్ బెత్లెహేమ్ ఏడి పేరుతో హైదరాబాద్ కొంపల్లిలో ఎన్ ఎల్ జి ప్రాంగణంలో 12 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకలకు సుమారు 350 మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు. ఈ ప్రదర్శన సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రేక్షకుల కోసం తెరిచి ఉంటుంది.