తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిహార్ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు (ఆగస్టు 31) న ఆయన బిహార్‌ పర్యటన ఉండనుంది. బుధవారం ఉదయం హైదరాబాద్ నుండి పట్నాకు ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. సీఎంవో వెల్లడించిన వివరాల ప్రకారం.. గాల్వాన్ లోయల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. బిహార్ కు చెందిన ఆ సైనికుల కుటుంబాలను ఆదుకుంటామని గతంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. సైనిక కుటుంబాలతో పాటు, ఇటీవలి సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు సీఎం రూ.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేయనున్నారు. 


బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కలిసి సీఎం కేసీఆర్ ఈ చెక్కులను పంపిణీ చేయనున్నారు. అనంతరం బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆహ్వానం మేరకు ఆయన నివాసంలోనే మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం నీతీశ్‌ కుమార్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అవుతారు. జాతీయ రాజకీయాలపై ఇద్దరూ సీఎంలు చర్చించనున్నారు. ఇటీవల బిహార్‌లో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.






‘‘ఈనెల 31న సీఎం శ్రీ కేసీఆర్ బీహార్ పర్యటన చేపట్టనున్నారు. బుధవారం ఉదయం హైదరాబాదు నుండి పాట్నాకు వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు, గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు బీహార్ కు చెందిన భారత సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు. సైనిక కుటుంబాలతో పాటు, ఇటీవలి సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు సీఎం 5 లక్షల రూపాయల ఆర్థికసాయం అందజేయనున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ ఆహ్వానం మేరకు మధ్యాహ్న భోజనం చేస్తారు.’’ అని తెలంగాణ సీఎంవో ట్వీట్ చేసింది.


సెప్టెంబరు 3న కేబినెట్ భేటీ
తెలంగాణ మంత్రివర్గ సమావేశాన్ని సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు, ప్రగతి భవన్ లో  నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ కేబినెట్ సమావేశంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు, నిర్వహణ, తదితర అంశాలపై చర్చించనున్నట్లుగా తెలంగాణ సీఎంవో అధికారులు తెలిపారు.


గుజరాత్ మోడల్ అంటూ మోసం - కేసీఆర్


పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌ నూతన కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.  గుజరాత్‌ మోడల్ అని చెప్పి దేశ ప్రజలను మోసంచేసి అధికారంలోకి వచ్చారన్నారు. అన్నింటిపై పన్నులు వేసి ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు.


సెప్టెంబరు 3న కేబినెట్ భేటీ
తెలంగాణ మంత్రివర్గ సమావేశాన్ని సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు, ప్రగతి భవన్‌లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ కేబినెట్ సమావేశంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు, నిర్వహణ, తదితర అంశాలపై చర్చించనున్నట్లుగా తెలంగాణ సీఎంవో అధికారులు తెలిపారు. సింగరేణిలో ఎన్ని వేల మందికి ఉద్యోగాల దొరుకుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. రామగుండం పట్టణాన్ని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసుకున్నామన్నారు. పెద్దపల్లి, సుల్తానా, మంతెన పట్టణాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసున్నామన్నారు.  26 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నాయకులు తనను కలిశారని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో ఉన్న ఏ కార్యక్రమం కూడా వాళ్ల రాష్ట్రాల్లో  అమల్లోలేవన్నారని తెలిపారు. వాళ్లంతా తనను తప్పనిసరిగా జాతీయ రాజకీయాల్లోకి రమ్మంటున్నారన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామా అని సీఎం కేసీఆర్ గట్టిగా చెప్పడంతో బహిరంగ సభ హోరెత్తింది.