Gold Seized Near Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (Shamshabad Airport) సమీపంలో పోలీసులు శుక్రవారం భారీగా బంగారం పట్టుకున్నారు. తనిఖీల సందర్భంగా బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా.. ఓ కారులో 34 కేజీల బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలు తరలిస్తున్నట్లు గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆభరణాలు ముంబయి నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నట్లు గుర్తించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు చెప్పారు.


Also Read: Teenmar Mallanna Assets:రాజకీయాల్లో సంచలనం, తన కుటుంబ ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చిన తీన్మార్ మల్లన్న