ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకువెళ్లాలని సంకల్పంతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముందుకు వెళ్తున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా జరిగిన సమావేశంలో 100 కంపెనీల సీఈఓ లతో మంత్రి కీటీఆర్ భేటీ అయ్యారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.... తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలలోనూ విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించడంతో పాటు ఇక్కడ ఉన్న అనుకూలతలు, తాము కల్పించిన మౌలిక వసతులపై మాట్లాడారు. 


ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ లలో ఐటీ టవర్లను ప్రారంభించుకున్నామన్న కేటీఆర్, త్వరలోనే సిద్దిపేట, నిజామాబాద్ , నల్గొండలోనూ ఐటీ టవర్ల నిర్మాణం పూర్తి కాబోతుందని చెప్పారు. దీంతోపాటు ఆదిలాబాద్ లోనూ మరొక ఐటీ టవర్ నిర్మిస్తున్నామన్నారు. మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశం అనంతరం నిజామాబాద్ ఇట్ హబ్ లో భాగంగా  8  ఐటీ కంపెనీల ప్రతినిధులు నిజామాబాద్ ఐటి హబ్ లో  కార్యకలాపాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల ఫలితంగా తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో  ఐటి ఉద్యోగాలు రాబోతున్నాయి. పరోక్షంగా ఎన్నో  వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.  ఈ సమావేశాన్ని  గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల, చేపూరి, విజయ్‌ రంగినేని సహకారoతో  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఈ విష్ణువర్ధన్‌రెడ్డి, చీఫ్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలంగాణ అన్నిరంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఈ ఒప్పందాల ఫలితంగా తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఎన్నో  ఐటి ఉద్యోగాలు రాబోతున్నాయి. పరోక్షంగా మరో వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. తెలంగాణలోని పట్టణాల్లో ఐటీ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు తెలుగు ఎన్ఆర్ఐలతో పాటు అనేకమంది నాన్ తెలుగు ఎన్ఆర్ఐలు కూడా ముందుకు వచ్చారు.


హైద‌రాబాద్‌లో మరో అమెరికా సంస్థ, 9 వేల మంది యువతకు ఉద్యోగాలు!
హైదరాబాద్‌లో మరో అమెరికా సంస్థ ఏర్పాటుకానుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రత్యేక గుర్తింపు అలియంట్ సంస్థ హైద‌రాబాద్‌లో కొత్త సెంట‌ర్‌ను ఏర్పాటు చేయనుంది. ఆ కంపెనీకి చెందిన సీఈవో ధ‌వ‌ల్ జాద‌వ్‌ను హూస్టన్‌లో మంత్రి కేటీఆర్ క‌లిశారు. క‌న్సల్టింగ్‌, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌లో ప‌వ‌ర్‌హౌజ్‌గా పేరుగాంచిన అలియంట్ గ్రూపు .. హైద‌రాబాద్‌లోని బీఎఫ్ఎస్ఐ రంగాన్ని బ‌లోపేతం చేయ‌నున్నట్లు మంత్రి వెల్లడించారు. 
హైదరాబాద్ కేంద్రంలో ఆ సంస్థ కొత్తగా 9 వేల మందిని రిక్రూట్ చేయ‌నున్నట్లు ఆయ‌న తెలిపారు. ట్యాక్స్‌, అకౌంటింగ్‌, ఆడిట్ స‌ర్వీస్‌, ఐటీ టెక్నాల‌జీకి చెందిన యువ‌త‌కు ఇదొక స‌దావ‌కాశం అవుతుంద‌ని మంత్రి తెలిపారు. బీఎఫ్ఎస్ఐ ప‌రిశ్రమ‌కు హైద‌రాబాద్ న‌గ‌రం కేంద్ర బిందువుగా మారుతోంద‌ని, అలియంట్ సంస్థ తీసుకున్న నిర్ణయం ఆ న‌గ‌రంపై ఉన్న విశ్వాసాన్ని, న‌మ్మకాన్ని చూపుతుంద‌ని మంత్రి త‌న ట్వీట్‌లో వెల్లడించారు. హూస్టన్‌లో ఉన్న అలియంట్ గ్రూపు ప్రధాన కార్యాల‌యానికి వెళ్లిన మంత్రి కేటీఆర్‌కు అక్కడ ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.