Nikhat Zareen: మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో సోమవారం జరిగిన మహిళల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ ఫైనల్ లో విజయం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం గెలుచుకుంది. తుది పోరులో రైల్వేస్ బాక్సర్ అనామికపై 4-1 తేడాతో విజయం సాధించింది. పోరు ఆరంభం నుంచి ఎటాకింగ్ గేమ్ ఆడిన నిఖత్ కు అనామిక కనీస పోటీ ఇవ్వలేకపోయింది. వరుస పంచ్ లతో విరుచుకుపడిన జరీన్ ప్రత్య్రర్థిని చిత్తుగా ఓడించి పసిడి సాధించింది. 






నిఖత్ కు మంత్రి వేముల అభినందనలు


కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్ దక్కించుకున్న నిఖత్.. తాజాగా మహిళల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ గెలవడం పట్ల తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణకు, తన పుట్టిన ఊరైన నిజామాబాద్ కు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చిందని అభినందించారు. భవిష్యత్ లో నిఖత్ జరీన్ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.