హైదరాబాద్ ఓల్డ్ సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పాతబస్తీలోని బహదూర్ పురాలో ఒక్కసారిగా నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగిపోయింది. నిర్మాణంలో ఉండగానే భవనం ఒరిగిపోయింది. బహదూర్ పురా హౌసింగ్ బోర్డు కాలనీలో ఘటన జరిగింది. భవనం నిర్మించిన ఓనర్ రెండంతస్తుల పర్మిషన్ తీసుకుని నాలుగు అంతస్తులు వేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. భవనం కింది భాగంలో పగుళ్లు ఏర్పడడాన్ని గుర్తించారు. 


విషయం పోలీసులకు తెలియడంతో బిల్డింగ్ చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించారు. దీంతో భవన యజమానిపై కేసు నమోదు చేశారు.