Telangana Formation day Celebrations: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి జూన్ 2తో పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాష్ట్ర ఆవిర్భావ కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నందున ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ను (Traffic Diversions in Hyderabad) మళ్లించబోతున్నారు. జూన్ 2న గన్ పార్క్, నాంపల్లి, పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగనున్నందున అక్కడ ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.


గన్ పార్క్ వద్ద (ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య మళ్లింపులు)


రవీంద్ర భారతి జంక్షన్ వద్ద సైఫాబాద్ ఓల్డ్ పీఎస్ నుంచి HTP వైపు వెళ్లే ట్రాఫిక్ ను ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.


ఏఆర్ పెట్రోల్ పంప్ - నాంపల్లి టీ జంక్షన్ నుంచి రవీంద్ర భారతి వైపు వచ్చే ట్రాఫిక్ ను ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద మళ్లించి బీజేఆర్ విగ్రహం వైపునకు పంపిస్తారు.


ఈ ప్రాంతాల్లోకి ట్రాఫిక్ నిషేధం (జూన్ 2 ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు)


వాహనదారులు పంజాగుట్ట - గ్రీన్‌ల్యాండ్స్ - బేగంపేట్ నుండి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల రోడ్ల వైపు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. టివోలి ఎక్స్ రోడ్స్ నుంచి ప్లాజా ఎక్స్-రోడ్స్ మధ్య రహదారి కూడా మూసివేసి ఉంటుంది. 


చిలకలగూడ X రోడ్లు,  ఆలుగడ్డబాయి X రోడ్లు, సంగీత్ X రోడ్లు, YMCA X రోడ్లు, (5) ప్యాట్నీ X రోడ్లు, SBH X రోడ్లు, ప్లాజా, CTO జంక్షన్, బ్రూక్‌బాండ్ జంక్షన్, తివోలి జంక్షన్,  స్వీకర్ ఉపాకర్ జంక్షన్,  సికింద్రాబాద్ క్లబ్, త్రిముల్‌ఘెరీ ఎక్స్ రోడ్లు, తాడ్‌బండ్ x రోడ్లు, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, బోవెన్‌పల్లి X రోడ్లు, రసూల్‌పురా, బేగంపేట్, పారడైజ్ ప్రాంతాల్లోకి ట్రాఫిక్ ను అనుమతించబోమని ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.


రైల్వే స్టేషన్ లేదా బస్ స్టేషన్ లకు చేరుకోవాల్సిన వారు మెట్రో రైలు సర్వీసును ఉపయోగించుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు సూచించారు.