Hyderabad News: ఏపీ తెలంగాణ మధ్య రాకపోకలు సాగించేవారికి శుభవార్త. ముఖ్యంగా హైదరాబాద్ - విజయవాడ రూట్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించేవారికి తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ఆఫర్ ప్రకటించింది. ఆ మార్గంలో టికెట్ రేటులో 10 శాతం రాయితీని ప్రకటించింది. ఈ రాయితీ సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ బస్సులలో వర్తిస్తుందని ఆర్టీసీ సంస్థ ప్రకటించింది.


‘‘హైదరాబాద్-విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఆ రూట్ లో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ కల్పిస్తోంది. రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. ముందస్తు రిజర్వేషన్ కోసం https://tgsrtcbus.in ని సంప్రదించండి’’ అని టీజీఎస్ఆర్టీసీ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.