Telangana Crime News: హైదరాబాద్‌లోని అమీర్‌పేట సమీపంలో ఉండే మధురానగర్‌-రహమత్‌నగర్‌ మధ్య దారుణమైన ఘట జరిగింది. పక్కింటి వారి  పెంపుడు కుక్క ఇంటిల్లపాది చితకబాదారు కొందరు పొరుగింటివాళ్లు. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


మధురానగర్‌- రహమత్‌నగర్‌లో శ్రీనాథ్‌, ధనుంజయ్‌ ఒకే కాలనీలో ఉంటున్నారు. ఈ మధ్య శ్రీనాథ్ పెంచుకుంటున్న కుక్క ధనుంజయ్‌ ఇంట్లోకి వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కాసేపు వాదులాడుకున్నారు. కుక్కను పెంచడమే కాదు వేరే వాళ్లకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని శ్రీనాథ్‌కు ధనుంజయ్‌ వార్నింగ్ ఇచ్చాడు. 


కాసేపటికి అంతా సైలెంట్ అయిపోయారు. తన పెంపుడు కుక్కను తీసుకొని వాకింగ్ వెళ్లాడు శ్రీనాథ్. కాస్త దూరం వెళ్లేసరికి ధనుంజయ్‌ తన స్నేహితులతో అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. వచ్చీ రాగానే మొదట శ్రీనాథ్‌పై దాడి చేశాడు. 


తర్వాత చేతిలో ఉన్న కుక్కపై కూడా కర్రలతో దాడి చేశారు ధనుంజయ్‌ అండ్ అతని ఫ్రెండ్స్. అక్కడితో ఆగిపోకుండా అడ్డు వచ్చిన శ్రీనాథ్‌ భార్యపై కూడా అటాక్ చేశారు. ఇలా వివాదం ముదిరిపోయింది. 






కాలనీ రోడ్డుపై భార్యభర్తలు ఇద్దర్నీ కర్రలతో చితకబాదారు. స్థానికులు అడ్డుకుంటున్నా... వద్దని దండం పెడుతున్నా ఆ కుర్రాళ్లు ఊరుకోలేదు. వారివైపు అరుస్తూ వస్తున్న కుక్కపై కూడా దాడి చేశారు. ఈ దృశ్యాలు అన్నీ కూడా స్థానికంగా ఉన్న సీసీ టీవీ కెమెరాకు చిక్కాయి. 


తీవ్రగాయాలతో శ్రీనాథ్‌, ఆయన భార్య, పెంపుడు కుక్క చికిత్స తీసుకుంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ చూసిన పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.