ఐటీ అధికారులు తమపై కక్ష సాధిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి మల్లారెడ్డి. తన కుమారుడిని కొట్టినందు వల్ల ఆయన ఆసుపత్రిలో చేరారన్నారు. ఆయన్ని చూసేందుకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి ఈ ఉదయం ఆసుపత్రిలో చేరారు. చాతీలో నొప్పి రావడంతో సూరారం ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని మీడియాలో చూసిన మల్లారెడ్డి ఆందోళనతో ఆసుపత్రికి బయల్దేరారు. 


మల్లారెడ్డిని ఐటీ అధికారులు అడ్డుకున్నారు. ఐటీ రైడ్స్ జరుగుతున్న ఈ టైంలో వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. దీంతో వారిపై మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారుడికి బాగాలేదంటే చూసేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎవరు అడ్డువచ్చినా తాను మాత్రం ఆసుపత్రిలో ఉన్న తన కుమారుడిని చూసే తీరుతానంటూ చెప్పుకొచారు.



మల్లారెడ్డిని ఐటీ అధికారులు అడ్డుకున్నారు. ఐటీ రైడ్స్ జరుగుతున్న ఈ టైంలో వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. దీంతో వారిపై మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారుడికి బాగాలేదంటే చూసేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. 


ఎవరు అడ్డువచ్చినా తాను మాత్రం ఆసుపత్రిలో ఉన్న తన కుమారుడిని చూసే తీరుతానంటూ చెప్పుకొచారు. తన కుమారుడిని రాత్రంతా ఇబ్బంది పెట్టారని అందుకే ఆయన ఆసుపత్రిలో చేరారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఆసుపత్రిలో ఉంటే వెళ్లకుండా అడ్డుకోవడం ఇదెక్కడి దుర్మార్గమని ప్రశ్నించారు. 


ఆసుపత్రికి వెళ్లేందుకు మల్లారెడ్డి ప్రయత్నాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు ఐటీ అధికారులు. ఆయన కాన్వాయ్ తాళాలు తీసుకున్నారు. అందరి ఫోన్లు లాక్కున్నారు. వెళ్లేందుకు వీళ్లేదని చెప్పడంతో వారితో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. తమపై బీజేపీ కుట్ర చేస్తోందని... ఎలాంటి తప్పు చేయకున్నా నిన్నటి నుంచి విచారణ పేరుతో ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే ఈ దాడులు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. తాము పేద పిల్లలకు చదువులు చెప్పించడం తప్పా అని ప్రశ్నించారు.



నిన్న ఉదయం నుంచి మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఆఫీస్‌లు, కాలేజీలు, ఇళ్లపై ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన కుమారులు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు.


మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రఘునాథ్ రెడ్డి వద్ద రూ.2 కోట్లకు పైగా నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ లో రఘునాథ్ రెడ్డి నివాసం ఉంటున్నారు. రఘునాథ్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసి రూ.2 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేశారు. మరోవైపు, జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ లో మల్లారెడ్డికి వరుసకు అల్లుడు అయ్యే సంతోష్ రెడ్డి ఇంటికి కూడా ఐటీ అధికారులు వెళ్లారు. సంతోష్ రెడ్డి తలుపు ఓపెన్ చేయకపోవడంతో ఐటీ అధికారులు వేచి చూస్తున్నారు. డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లే అలోచనలో ఐటీ ఆఫీసర్స్ ఉన్నారు.


కొత్త విషయాలు


మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలపై జరుగుతున్న ఐటీ సోదాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జైకిషన్‌ ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. జైకిషన్‌, మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్‌లు కలిసి క్యాసినోలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. గతంలో కూడా జైకిషన్‌ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. జైకిషన్‌ తండ్రి నరసింహ, మంత్రి మల్లారెడ్డి వ్యాపార భాస్వాములు అని గుర్తించారు. సీఎంఆర్‌ స్కూల్స్‌లో నరసింహ యాదవ్‌, మల్లారెడ్డి పార్ట్‌నర్స్‌గా ఉన్నారు. దీంతో నరసింహ యాదవ్‌, జైకిషన్‌ ఇళ్లల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. 14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు చేపట్టింది. కాలేజీల ఆర్థిక లావాదేవీల రికార్డులు పరిశీలిస్తున్నారు.