Hyderabad Crime News: ఇద్దరూ స్నేహితులు, ఒకే ఆఫీస్‌లో పని చేస్తున్నారు. అందులో ఒకరు తనకు వచ్చిన కష్టాన్ని తన స్నేహితుడికి చెప్పుకున్నాడు. స్పందించిన మిత్రుడు సమస్యను తాను తీరుస్తానని నమ్మించాడు. అదే అవకాశంగా మార్చుకుని మంత్రాల పేరిట స్నేహితుడి భార్యపై అత్యాచారం చేశాడు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ (Medchal Police Station) పరిధిలో ఈ దారుణం జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన నవీన్ (పేరు మార్చాం) ఉపాధి కోసం మేడ్చల్‌కు వలస వచ్చాడు. మేడ్చల్ మండల పరిధిలోని రావల్ కోల్‌లో ఉన్న సింగానియా చాక్లెట్ కంపెనీలో పనిచేస్తూ కిష్టాపూర్‌లో నివాసం ఉంటున్నారు. నవీన్ పనిచేస్తున్న చోట ఒడిశాకే చెందిన షేక్ మోసిన్(41) పని చేన్నాడు. వీరిద్దరు స్నేహితులు. కొద్ది కాలంగా నవీన్ భార్యకు ఆరోగ్యం బాగుండడం లేదు. దీంతో తనకు వచ్చిన కష్టం గురించి స్నేహితుడు షేక్ మోసిన్‌కు చెప్పుకున్నాడు. దాన్ని అవకాశంగా తీసుకున్న షేక్ మోసిన్ తనకు మంత్రాలు వస్తాయని స్నేహితుడిని నమ్మించాడు. సమస్య ఏదైనా ఉంటే నయం చేస్తానని నమ్మబలికాడు. నవీన్ సైతం మోసిన్ మాటలు నమ్మాడు. సమస్య ఏదైనా ఉంటే మోసిన్‌కు చెప్పాలని నవీన్ భార్యకు చెప్పడంతో ఆమె సైతం అది నమ్మింది.


దీంతో నవీన్ దంపతులు ఇద్దరూ మోసిన్ వద్దకు వెళ్లారు. తనకు నైట్ షిప్ట్ ఉందని, తన తమ్ముడు ఇక్కడే ఉంటాడని చెప్పి నవీన్ వెళ్లిపోయాడు. మంత్రం వేస్తానని చెప్పి మోసిన్ ఆమెను గదిలోకి వెళ్లమన్నాడు. అక్కడే ఉన్న నవీన్ తమ్ముడిని ఇంటి బయట ఉండాలని, మంత్రం వేసేటప్పుడు అరుపులు విన్పిస్తాయని పట్టించుకోవద్దని నమ్మించాడు. మోసిన్ గది లోపలికి వెళ్లి, తన సహ ఉద్యోగి స్నేహితుడి భార్యపై అత్యాచారానికి పాల్పడి, పారిపోయాడు. ఈ అవమానం భరించలేక బాధితురాలు బాధితురాలు అవమానంతో ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. జరిగిన విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 


ఏప్రిల్ నెలలో మహిళపై అత్యాచారం
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏప్రిల్ నెలలో ఇలాంటి దారుణమే జరిగింది. ఇద్దరు అగంతకులు లైంగిక దాడికి పాల్పడడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఓ మహిళ అక్కడే మరణించింది. .కూకట్ పల్లి ప్రశాంత్ నగర్ లోని విష్ణు ప్రియ లాడ్జీ సమీపంలోని ఓ బైక్ షో రూమ్‌లో ఓ మహిళ 2019 నుంచి స్వీపర్‌గా పని చేసేది. ఆమెకు మద్యం తాగే అలవాటు కూడా ఉంది. పక్కనే ఉన్న వైన్ షాప్ లో మద్యం తాగి రాత్రి వరకు అక్కడే ఉండి, మూసా పేట్ లోని చిత్తరమ్మ ఆలయం పరిసర ప్రాంతంలో నిద్రించేది. 


ఏప్రిల్ నెల 21వ తేదీ ఆదివారం తెల్లవారుజామున సుమారు 4 - 5 గంటల మధ్య మహిళ మూసాపేటకు వెళుతుండగా ఇద్దరు దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చారు. ఒకరు చేతులు, మరొకరు కాళ్లు పట్టుకొని బలవంతంగా పక్కనే ఉన్న ఏఆర్ పైప్ వర్క్స్ సెల్లార్‌కు లాకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. తరువాత బైక్‌పై కూకట్‌పల్లి వైపు వెళ్లారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని. పోస్టుమార్టం నిమిత్తం మృతి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.  మ‌ృతురాలి వయసు 32 నుంచి 38 ఏళ్ల మధ్య ఉంటుందని, రక్తస్రావం కావడంతో ఆమె మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.