Medchal News: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇడబ్ల్యూయస్ కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న ఓ నాలుగేళ్ల చిన్నారిని స్థానికంగా ఉన్న ఓ థియేటర్ లో పని చేసే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అయితే చాలా సేపటి వరకు పాప ఇంట్లోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు.. పాపను వెతుక్కుంటూ బయటకు వచ్చారు. ఎంత చూసినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో పాప రోజూ ఆడుకునే పిల్లలు.. దగ్గరి రోడ్లలో మొత్తం వెతికారు. అయినప్పటికీ బాలిక దొరక్కపోయే సరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు. బాలిక కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన వెంటనే స్పెషల్ పార్టీ టీం పోలీసులు రంగంలోకి దిగారు. వీరితో పాటు మల్కాజిగిరి డీసీపీ జానకి, ఏసీపీ నరేష్ రెడ్డి కూడా వచ్చి బాలిక తల్లిదండ్రులను కలిశారు. పాపకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాప మిస్సైన విషయం తెలుసుకున్న కాలనీ వాసులంతా వారి ఇంటి దగ్గర గుమిగూడారు. 




రంగంలోకి దిగిన పోలీసులు స్థానిక ప్రజలను కూడా విచారించారు. ఇలా బాలిక నివాసానికి దగ్గర్లోనే ఉన్న జగదాంబ థియేటర్ లో పని చేసే సురేష్ యే పాపను తీసుకెళ్లాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వెంటనే బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు. ఈ క్రమంలోనే సకింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పాపతో సహా నిందితుడు కనిపించగా పోలీసులు అరెస్ట్ ేశారు. ప్రస్తుతం బాలికి క్షేమంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీసీ కెమెరాలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కాలనీ వాసులు చెబుతున్నారు.