హైదరాబాద్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ శశి థరూర్, సూపర్ స్టార్ మహేశ్ బాబు యాదృచ్ఛికంగా కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్ ఇందుకు వేదికైంది. ఇలా తాము కలుసుకొని మాట్లాడుకున్నట్లుగా ఎంపీ శశి థరూర్ ట్వీట్ చేశారు. మహేశ్‌తో మాట్లాడుతున్న వీడియోను కూడా ట్వీట్‌కు జత చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అయింది. 


‘‘మహేశ్‌ బాబుతో మాట్లాడుతున్నా.. ఆయన ఇప్పుడే తన సినిమాలోని విలన్లని కొట్టి వచ్చాడు. ఆ వెంటనే మేం కలిశాం. మహేశ్‌ని కలవడం చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. శశి థరూర్‌తోపాటు గుంటూరు ఎంపీ, టీడీపీ నేత గల్లా జయదేవ్‌ కూడా పక్కనే ఉన్నారు.






ఇంతకీ వారు ఎలా కలిశారంటే..
సూపర్ స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరుగుతోంది. ఇక్కడ సర్కారు వారి పాట సినిమాలోని కీలక ఫైటింగ్ సీన్లను తెరకెక్కిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ కూడా ఆ హోటల్‌కు వచ్చారు. ఎందుకంటే.. తెలంగాణలో ఐటీ రంగానికి సంబంధించి కేంద్రం పంపిన పార్లమెంటరీ కమిటీకి శశి థరూర్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ పార్లమెంటరీ కమిటీ బుధవారం మంత్రి కేటీఆర్ సహా ఐటీ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయి రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్థితి గతులపై చర్చించింది. ఆ సమావేశం ముగిశాక శశి థరూర్ వెళ్లిపోతుండగా.. వీరు ఇద్దరూ కలుసుకున్నారు. 


ఎంపీ గల్లా జయదేవ్ చొరవతో వీరు కలిసి మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. పక్కనే షూటింగ్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్ ఉండడంతో శశి థరూర్‌ స్వయంగా షూటింగ్ జరిగే చోటుకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. కాసేపు సరదాగా ముచ్చటించుకున్న వీరు సోషల్‌ మీడియా వేదికగా ఆ విశేషాల్ని పంచుకున్నారు.


Also Read: Revanth Reddy: కేసీఆర్-మోదీల మధ్య ఫెవికాల్ బంధం, ఇక వీళ్లిద్దరూ బలిపశువులే.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు


Also Read: YS Sharmila: రోడ్డంతా బురదమయం.. షర్మిలకు మట్టి అంటకుండా భలే ఐడియా, ఏం చేశారో చూడండి