Telangana : హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. ఉదయం ఐదు గంటల  నుంచి ఓ న్యూస్ ఛానల్ అధినేత ఇళ్లు, కార్యాలయాలపై తనిఖీలు చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, బంజారాహిల్స్ చెక్‌పోస్టు, మాదాపూర్‌ని ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు. 


బొల్లా రామకృష్ణ న్యూస్ ఛానల్‌తోపాటు ఫైనాన్స్‌, హాస్పిటల్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. ఎందుకు తనిఖీలు చేస్తున్నారు. వచ్చిన ఆరోపణలు ఏంటని మాత్రం బయటకు రావడం లేదు. దాదాపు పది మంది అధికారుల బృందం ఉదయం ఐదు గంటల నుంచి ఆయన నివాసాలు, కార్యాలయాల్లో క్షణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. 


ప్రస్తుతం బొల్లా రామకృష్ణ కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టాస్ ఐ బ్యాక్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడ కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎవర్నీ అటుగా వెళ్లనీయడం లేదు.