MMTS Trains Cancelled: హైదరాబాద్, సికింద్రాబాద్​ జంట నగర వాసులకు బ్యాడ్ న్యూస్. భారీ వర్షాలు కురుస్తుండటంతో ట్విస్ సిటీస్‌లో తిరిగే పలు ఎంఎంటీఎస్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. జంట నగరాలలో పలు ఎంఎంటీఎస్ సర్వీసులను నేటి నుంచి మూడు రోజులపాలు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రైళ్ల రద్దుకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది. జూలై 11 నుంచి జూలై 13 వరకు 72 గంటలపాటు ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు అందుబాటులో ఉండవని అధికారులు తెలిపారు. నగరంలో నడిచే మొత్తం 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేశారు.


రద్దయిన ఎంఎంటీఎస్ సర్వీసుల వివరాలు..
హైదరాబాద్‌ - లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు - 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120
లింగంపల్లి - హైదరాబాద్ మార్గంలో 9 సర్వీసులు - 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140
ఫలక్‌నుమా - లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు - 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170
లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంలో 7 సర్వీసులు - 47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192 
లింగంపల్లి - సికింద్రాబాద్ మార్గంలో 1 సర్వీసు - 47195 
సికింద్రాబాద్ - లింగంపల్లి మార్గంలో 1 సర్వీసు - 47150 సర్వీసు రద్దు 






పలు ప్యాసింజర్, స్పెషల్ రైళ్లు రద్దు..
దక్షిణ మధ్య రైల్వే పలు రైలు సర్వీసులను రద్దు చేయగా, కొన్ని సర్వీసులను రీషెడ్యూల్ చేసింది. 


సికింద్రాబాద్ ఉందానగర్ ప్యాసింజర్ స్పెషల్,
సికింద్రాబాద్ ఉందా నగర్ MEMU స్పెషల్,
మేడ్చల్ ఉందా నగర్ MEMU స్పెషల్, 
ఉందా నగర్ - సికింద్రాబాద్ MEMU స్పెషల్,
సికింద్రాబాద్ - ఉందా నగర్ సికింద్రాబాద్ MEMU స్పెషల్, 
నాందేడ్ - మేడ్చల్ - నాందేడ్ ప్యాసింజర్ స్పెషల్,
సికింద్రాబాద్ - మేడ్చల్ MEMU స్పెషల్, 
మేడ్చల్ - సికింద్రాబాద్ MEMU స్పెషల్,
కాకినాడ పోర్ట్ - విశాఖపట్నం - కాకినాడ పోర్ట్ MEMU
విజయవాడ - బిట్రగుండ - విజయవాడ MEMU


Also Read: IMD Rains Alert: ఈ 12 లేదా 13న మరో అల్పపీడనం ముప్పు - 7 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన


Also Read: Rains in AP Telangana: దంచికొడుతున్న వర్షాలు - తెలంగాణలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఏపీలోనూ ఆ జిల్లాల్లో కుండపోత: IMD