ఏంది కేసీఆర్ నువ్వు కొంచెం భిన్నంగా మాట్లాడుతున్నవు ఈ మధ్య... ఒక రకమైన వేధాంత ధోరణిలో మాట్లాడుతున్నావని అన్నారు. దేశం బాగుంటే, సమాజం బాగుంటే, ప్రపంచంలో శాంతి సామరస్యాలు ఉంటేనే మనం సుఖంగా ఉండగలం. మనకి ఎన్ని ఆస్తులున్నా శాంతి లేని నాడు జీవితం అతలాకుతలం అవుతుంది. అలాంటి శాంతి ఉండే భారత దేశంలో మహాత్ముడ్నే కించపర్చే కొన్ని మాటలు మనం వింటున్నం. అలాంటప్పుడు దు:ఖం కలుగుతది. సమాజాన్నీ చీల్చే కొన్ని చిల్లర మల్లర శక్తులు చేసే ప్రయత్నాలు మీకందరికీ తెలుసు. వెకిలి వ్యక్తులు చేసే వెకిలి ప్రయత్నాల వల్ల మహాత్ముడి ప్రభ ఏనాటికీ తగ్గదు. అంతేకానీ, మరుగుజ్జులు ఏనాటికీ మహాత్ములు కాలేరు. ఏనాటికైనా గాంధీ సిద్ధాంతమే ఉంటుంది- కేసీఆర్