పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తనకు అవార్డు ప్రకటన సందర్బంగా చిరంజీవి ఆదివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరై సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పద్మ విభూషణ్ రావడం పట్ల చిరంజీవికి సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.