హైదరాబాద్: ఢిల్లీలోని నిర్వచన్ సాధన్ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 5 మధ్యాహ్నం 3:00 గంటలకు దేశంలోని రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రతినిధి బృందాన్ని భారత ఎన్నికల కమిషన్ (ECI) అధికారికంగా ఆహ్వానించింది. ఈ ప్రతినిధి బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె. తారకరామారావు (KTR) నేతృత్వం వహించనున్నారు. కేటీఆర్తో పాటు పార్టీ కీలక నేతలు, మాజీ ఎంపీలు బీఆర్ఎస్ ప్రతినిధి బృందంలో ఉండనున్నారు. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి పార్టీ (BRS)కి, ఈసీఐ కార్యదర్శి అశ్విని కుమార్ మొహాల్ ఒక అధికారిక లేఖలో కోరారు. ఈ ఆహ్వానాన్ని తెలంగాణ (Telangana) ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు కూడా పంపారు.
- కె.ఆర్. సురేశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్
- వడ్డిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
- బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ
- బeల్క సుమన్, మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత
- ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి
ఢిల్లీలో జరగనున్న ఈ కీలక సమావేశంలో ఎన్నికల సంస్కరణలు, ఇప్పటికే ఈసీఐకి సమర్పించిన వివిధ అభ్యర్థనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి సంబంధిత అంశాలపై చర్చ జరిగే అవకాశముందని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.