Telangana : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ వరద బాధితులకు బాసటగా నిలిచారు. తెలంగాణ సీఎం రిలీప్ ఫండ్‌కు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. త్వరలోనే కోటి రూపాయల చెక్‌ను తెలంగాణ సీఎంకు అందజేయబోతున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే ఏపీ వరద బాధితుల కోసం కోటి రూపాయలు ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 1 కోటి రూపాయల విరాళం ఇస్తున్నానని బుధవారం వెల్లడించారు. కాసేపట్లో సీఎం చంద్రబాబును కలిసి చెక్ అందజేస్తారు. రాష్ర్ట విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయంలో వరద ప్రభావిత ప్రాంతాలపై పవన్ కల్యాణ్ రెండు రోజులుగా సమీక్ష నిర్వహిస్తున్నారు. 


 


 


 


Also Read: వరద బాధితులకు పవన్ కళ్యాణ్ రూ.1 కోటి విరాళం - మహేష్ బాబు సైతం భారీగానే సాయం