బీఆర్‌ఎస్‌ రాజ్యసభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కంగనా రనౌత్  శంషాబాద్ ఎయిర్ పోర్టు అవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ  గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్క నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. బావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించి కాలుష్యాన్ని నివారించే కార్యక్రమాన్ని ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బాధ్యతగా మొక్కలు నాటాలని కంగనా పిలుపునిచ్చారు. ఈ అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.






ఈ కార్యక్రమంలో కంగనాతోపాటు  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, GIC డైరెక్టర్ బాధావత్ పూర్ణ చందర్ నాయక్ పాల్గొన్నారు. కంగనా రనౌత్  'వృక్ష వేదం' పుస్తకాన్ని అందజేశారు.