జియో సైలెంట్‌గా కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోనే అత్యంత చవకైన రీచార్జ్ ప్లాన్ ఇదే. రూ.1 విలువైన ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉండనుంది. డేటా అవసరం అయినప్పుడు మాత్రమే కొనుగోలు చేసేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ మై జియో యాప్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. జియో తన రూ.119 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను కూడా సవరించింది.


ఈ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉండనుంది. ఈ ప్లాన్ ద్వారా 100 ఎంబీ డేటా లభించనుంది. ఆ డేటా పూర్తయితే నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోనుంది. ఈ కొత్త రీచార్జ్ ప్లాన్‌ను వాల్యూ సెక్షన్‌లో చూడవచ్చు. జియో 1 జీబీ డేటా ప్యాక్ విలువ రూ.15 రోజులుగా ఉంది. కానీ 100 ఎంబీ ప్యాక్‌తో పది సార్లు రీచార్జ్ చేస్తే 1 జీబీ డేటా లభించనుంది. అంటే 1 జీబీ డేటాను రూ.10కే పొందవచ్చన్న మాట.


ప్రస్తుతానికి జియో తప్ప మరే నెట్‌వర్క్ ప్రొవైడర్ రూ.1 కంటే తక్కువ ధరకు రీచార్జ్ ప్లాన్ అందించడం లేదు. పైన చెప్పినట్లు డేటా అవసరం అయినప్పుడు మాత్రమే రీచార్జ్ చేసుకునేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడనుంది. అయితే ఈ ప్లాన్‌తో వినియోగదారులు ఎన్నిసార్లు రీచార్జ్ చేసుకోవచ్చో తెలియరాలేదు.


ఈ నెల ప్రారంభంలో జియో సైలెంట్‌గా తన రూ.119 ప్రీపెయిడ్ ప్లాన్‌ను సవరించింది. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే.. రోజుకు 1.5 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా లభించనున్నాయి. గతంలో రూ.98 ప్లాన్ ద్వారా ఇవే లాభాలు అందించేవారు.


ధరతో పాటు వ్యాలిడిటీలో కూడా కొన్ని మార్పులు చేశారు. రూ.98 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు కాగా, రూ.119 ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు మాత్రమే ఉంది.


Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?


Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి