షియోమీ ఇటీవలే మనదేశంలో రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రోను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ వాచ్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అమెజాన్, ఎంఐ.కాంల్లో ఈ బ్యాండ్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో మొత్తం 110 వర్కవుట్ మోడ్స్ అందుబాటులో ఉండనున్నాయి.


రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో ధర
ఈ స్మార్ట్ వాచ్ ధరను రూ.3,999గా నిర్ణయించారు. అయితే ప్రారంభ ఆఫర్ కింద కొద్దికాలం పాటు రూ.3,499కే ఈ బ్యాండ్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. షియోమీ అధికారిక వెబ్ సైట్, అమెజాన్, ఎంఐ హోం స్టోర్లలో ఈ స్మార్ట్ బ్యాండ్ కొనుగోలు చేయవచ్చు.


రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో స్పెసిఫికేషన్లు
ఈ వాచ్‌లో 1.47 అంగుళాల ఆల్వేస్ ఆన్ అమోఎల్ఈడీ టచ్ డిస్‌ప్లేను అందించారు. అపోలో 3.5 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ వాచ్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 200 ఎంఏహెచ్ కాగా.. 14 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ వాచ్ అందించనుందని కంపెనీ తెలిపింది.


ఈ బ్యాండ్‌లో లైఫ్‌క్యూ హెల్త్ ట్రాకింగ్ అల్గారిథంను అందించారు. పీపీజీ హార్ట్ రేట్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, సిక్స్-యాక్సిస్ సెన్సార్‌లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. బ్లూటూత్ వీ5.0ను కూడా ఈ స్మార్ట్ వాచ్‌లో అందించారు. 5ఏటీయం వాటర్ ప్రూఫ్ ఫీచర్ ఇందులో ఉండటం విశేషం.


ఐవోఎస్ 10, ఆపైన లేదా ఆండ్రాయిడ్ 6 (మార్ష్‌మాల్లో), ఆపైన ఆపరేటింగ్ సిస్టంలను రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో సపోర్ట్ చేయనుంది. ఇందులో 110 వర్కవుట్ మోడ్స్‌ను షియోమీ అందించింది. ఎస్‌పీఓ2 మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను కూడా ఈ వాచ్ సపోర్ట్ చేయనుంది.


రన్నింగ్, వాకింగ్, జుంబా, పైలేట్స్, యోగా, సైక్లింగ్, హెచ్ఐఐటీ, జంపింగ్ రోప్ వంటి వర్కవుట్లను ఈ స్మార్ట్ వాచ ట్రాక్ చేయగలదు. దీంతోపాటు అవుట్ డోర్ వాకింగ్, అవుట్ డోర్ రన్నింగ్, ట్రెడ్ మిల్ వర్కవుట్లను ఇది ఆటోమేటిక్‌గా ట్రాక్ చేయడం విశేషం. 


Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!


Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!