కరోనా వైరస్ తర్వాత ప్రజలు తమ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం ప్రారంభించారు. ఎప్పటికప్పుడు వారి చేతులను శుభ్రపరచుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి. ప్రతి వ్యక్తి సాధారణంగా రోజులో ఆరు నుండి ఎనిమిది సార్లు చేతులు కడుక్కోవాలి. అయినప్పటికీ మనందరి చేతుల మీద వేలాదిగా బ్యాక్టీరియా ఉంది. దీనికి కారణం మీ స్మార్ట్‌ఫోన్ అంటే మీరు ఆశ్చర్యపోతారు. వాస్తవానికి మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే టాయిలెట్ సీట్ల కంటే 10 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా మన స్మార్ట్‌ఫోన్‌లపై కనిపిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది.


టాయిలెట్ సీటుపై అన్ని పనులు జరుగుతున్నాయి
నార్డ్‌వీపీఎన్ అధ్యయనం ప్రకారం 10 మందిలో ఆరు మంది తమ ఫోన్‌ను వాష్‌రూమ్‌కు తీసుకువెళతారు. వీరిలో ముఖ్యంగా యువత ఎక్కువగా ఉంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 61.6% మంది టాయిలెట్ సీటుపై కూర్చొని ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాలను చెక్ చేస్తునట్లు అంగీకరించారు.


అధ్యయనం ప్రకారం దాదాపు మూడో వంతు (33.9%) మంది ప్రజలు బాత్రూమ్‌లో కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు. పావువంతు (24.5%) మంది తమకు ఇష్టమైన వారికి మెసేజ్‌లు పంపుతున్నారు. తమ జీవితానికి సంబంధించిన కొన్ని సమస్యలను, దాని పరిష్కారాన్ని టాయిలెట్ సీటుపైన కూర్చునే ఆలోచిస్తూ ఉంటారు.


స్మార్ట్‌ఫోన్‌ను ఎల్లవేళలా ఉపయోగించే అలవాటు కూడా చాలా చెడ్డది. కానీ మీరు దానిని టాయిలెట్ సీటుపై పెట్టినప్పుడు ప్రమాదం మరింత పెరుగుతుంది. టాయిలెట్ సీటులో ఉండే బ్యాక్టీరియా స్మార్ట్‌ఫోన్ ఉపరితలంపైకి వచ్చి, ఆపై అవి మన చేతుల ద్వారా మన శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. దీని కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు.


టచ్ స్క్రీన్ అనేది డిజిటల్ దోమ
మొబైల్ ఫోన్ స్క్రీన్‌పై బ్యాక్టీరియా 28 రోజుల పాటు జీవించగలదని నివేదిక ద్వారా తెలిసింది. ఈ నివేదికలో ఇన్ఫెక్షన్ నియంత్రణ నిపుణుడు డాక్టర్ హ్యూ హేడెన్, యాహూ లైఫ్ యూకేతో మాట్లాడుతూ, స్మార్ట్‌ఫోన్‌లు టాయిలెట్ సీట్ల కంటే 10 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉంటాయనేది నిర్ధారితం అయిన వాస్తవం అన్నారు. స్మార్ట్‌ఫోన్ టచ్‌స్క్రీన్ డిజిటల్ యుగానికి చెందిన దోమ అని ఆయన అన్నారు. అందుకే స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్స్ వంటివి వాష్‌రూమ్‌కి తీసుకెళ్లకుండా మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మంచిదని సూచించారు.


మరో వైపు వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీని మరింత టైట్ చేయడానికి మెటా ఇటీవల ఛాట్ లాక్ ఫీచర్‌ను యాడ్ చేసిన సంగతి తెలిసిందే. దాని సహాయంతో మన వాట్సాప్‌లో కావాల్సిన ఛాట్లను లాక్ చేయవచ్చు. ఛాట్‌ను లాక్ చేయడానికి, మీరు ఆ యూజర్ ప్రొఫైల్‌కు వెళ్లి అక్కడ కనిపించే ఛాట్ లాక్ ఆప్షన్‌ను ఆన్ చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆ ఛాట్ పూర్తిగా మరో ఫోల్డర్‌కి మూవ్ అయిపోతుంది. మీరు కూడా ఈ వాట్సాప్ ఫీచర్‌ని ఉపయోగిస్తున్నట్లయితే కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి.


మీరు వాట్సాప్‌లో ఛాట్‌ను లాక్ చేసినట్లయితే, అది వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో లాక్ అవ్వదని గుర్తించాలి. అంటే వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో ఆ ఛాట్‌ను ఎవరైనా చూడగలరన్న మాట. మీరు వాట్సాప్ వెబ్‌లో మీ అకౌంట్‌ను ఓపెన్ చేసి ఉంచినట్లయితే, అవతలి వ్యక్తి మీరు లాక్ చేసిన ఛాట్‌లను చూడగలరు. మీరు ఛాట్ లాక్ ఫోల్డర్‌ను ఓపెన్ చేసి, ఆ విండోను క్లోజ్ చేయడం మర్చిపోయినా కూడా మీరు లాక్ చేసిన ఛాట్‌లను వేరే వ్యక్తులు చదవగలరు.





Read Also: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!