టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ మరో రెండు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో ఒకటి స్వర్ణం కాగా... మరొకటి కాంస్యం. బ్యాడ్మింటన్ పురుషుల SL3 విభాగంలో భారత పారా అథ్లెట్ ప్రమోద్ భగత్ ఫైనల్లో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. ఇదే విభాగంలో మరో అథ్లెట్ మనోజ్ సర్కార్ కాంస్య పతకం గెలిచాడు.