Pak Fan sad after India Win: టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup )లో భారత్‌(Team India) జైత్రయాత్ర సంగతమేమో గానీ పాక్ మాత్రం బలైపోయింది.  టీ20 వరల్డ్‌ కప్‌లో చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న భారత్, పాకిస్థాన్ మధ్య లో జరిగిన ఈ స్కోరింగ్‌ మ్యాచ్‌ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. కానీ పాపం లక్షలు పెట్టి టికెట్టు కొన్న పాక్ అభిమానులకి  మాత్రం తెగ  బాధ పడిపోయారు.  ఈ మ్యాచ్ కోసం ఓ పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్  టికెట్ కోసం తన ట్రాక్టర్​నే అమ్మేశాడు. కానీ దానికి  ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. ఈ  లో స్కోరింగ్ మ్యాచ్‌లో పాక్ చివరి వరకు పోరాడి.. కేవలం 6 పరుగుల తేడాతో ఓడింది. అనూహ్యమైన ఈ ఓటమితో పాకిస్తాన్ ఫాన్స్ మాత్రమే కాదు.. పాపం ప్లేయర్స్ కూడా కన్నీటిపర్యంతం అయ్యారు.