BCCI secretary Jay Shah  wrote to top cricketers:  టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ కార్యదర్శి జై షా(BCCI secretary Jay Shah)... తీవ్ర హెచ్చరికలు చేశాడు. గాయమైతే తప్ప.. రంజీ ట్రోఫీ లేదా ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్‌లలో ఆడకపోతే  తీవ్ర పర్యవసనాలు ఉంటాయని సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఉన్న ఆటగాళ్లను, భారత్‌-ఏ స్థాయి ఆటగాళ్లను జై షా హెచ్చరించాడు. ఈ మేరకు క్రికెటర్లకు అతడు లేఖ రాశాడు. జాతీయ జట్టులోకి ఎంపికకు దేశవాళీ క్రికెట్‌ ముఖ్యమైన కొలబద్ద అని షా స్పష్టం చేశాడు. కొందరు ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌ కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యమిస్తున్నారని.. ఇదా తాము ఊహించలేదని జై షా అన్నాడు.  భారత క్రికెట్‌కు ఎప్పుడూ దేశవాళీ క్రికెట్టే పునాదని గుర్తు చేశాడు.  తామెప్పుడూ దేశవాళీ క్రికెట్‌ను తక్కువగా చూడలేదని కూడా జై షా తెలిపాడు. భారత్‌కు ఆడాలనుకునే ప్రతి ఆటగాడు ముందు దేశవాళీ క్రికెట్లో తనను తాను నిరూపించుకోవాలని సూచించాడు. ఆటగాళ్లు దేశవాళీలో ఆడకపోతే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని షా హెచ్చరించాడు. జాతీయ జట్టులో లేకపోయినా ఇషాన్‌ కిషన్‌ రంజీ మ్యాచ్‌ల్లో ఆడకపోవడం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో జై షా చేసిన తీవ్ర హెచ్చరికలు వైరల్‌గా మారాయి. 

టీ 20 వరల్డ్‌ కప్‌ కెప్టెన్‌గా రోహితే
అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా జరిగే పొట్టి ప్రపంచకప్‌(T20 World Cup)లో టీమిండియా(Team India)ను ఎవరు  నడిపిస్తారనే ఊహాగానాలకు తెరపడింది. భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియాను అద్భుతంగా నడిపించిన సారధి రోహిత్‌ శర్మ(Rohit Sharma)నే.... టీ 20 ప్రపంచకప్‌లోనూ సారధ్య బాధ్యతలు చేపడతాడని బీసీసీఐ స్పష్టం చేసింది. రాబోయే టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మనే టీమ్‌ఇండియాకు నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తేల్చి చెప్పారు. వరుసగా పది మ్యాచ్‌ల్లో నెగ్గిన తర్వాత.. మనం 2023 వన్డే ప్రపంచకప్‌ గెలవలేకపోయినా, మనసులు గెలిచామని గుర్తు చేసిన జై షా.... 2024 టీ20 ప్రపంచకప్‌లోనూ  రోహిత్‌ సారథ్యంలో త్రివర్ణ పతాకం ఎగరేస్తామని ప్రకటించారు.  రోహిత్ శర్మనే భారత జట్టును ఈ మెగా టోర్నీలో ముందుకు నడిపిస్తాడని  షా  పేర్కొన్నారు.  ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని జై షా క్లారిటీ ఇచ్చారు. జూన్ 4 నుంచి టి20 వరల్డ్ కప్ టోర్నీ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ఐసీసీ ఈవెంట్ కు వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.


ఎప్పటి నుంచంటే..?
క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్‌ 2024 (T 20 World Cup 2024)షెడ్యూల్‌ వచ్చేసింది. జూన్‌ 1 నుంచి పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా(USA)తో కెనడా(Canada) తలపడబోతోంది. జూన్‌ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్‌ జూన్‌ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్‌ ఏ లో భారత్‌(Bharat), పాకిస్థాన్‌(Pakistan) జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్‌ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది.